![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -148 లో....శ్రీవల్లి చందు, వేదవతి, ప్రేమ , ధీరజ్ భాగ్యం ఇంటికి వస్తారు. ఇక వాళ్ళంతా రాగానే శ్రీవల్లిని హగ్ చేసుకుంటుంది భాగ్యం. నేను చెప్పినట్లు నగలు తీసుకొని వచ్చావా అని అడుగుతుంది. తీసుకొని వచ్చానని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత భాగ్యం హారతి ఇచ్చి శ్రీవల్లి, చందులని ఆహ్వానిస్తుంది. అందరు లోపలికి వెళ్ళాక నర్మద, సాగర్ ఎందుకు రాలేదని భాగ్యం అడుగుతుంది. వదినకి లీవ్ ఇవ్వలేదని అమూల్య చెప్తుంది.
ఆ తర్వాత శ్రీవల్లిని తీసుకొని భాగ్యం పక్కకి వెళ్తుంది. నగలన్నీ తీసుకొని వచ్చినట్లే కదా అని శ్రీవల్లిని భాగ్యం అడుగుతుంది. తీసుకొని వచ్చాను ఆ కామాక్షి ఆడపడుచు కట్నం అంటే ఒక నగ తీసి ఇచ్చానని శ్రీవల్లి అనగానే.. అది గిల్ట్ నగ ఎందుకు ఇచ్చావ్.. ఎక్కడైనా చెక్ చేయిస్తే బండారం బయటపడుతుంది. నువ్వు వెళ్ళాక తనని మాయ చేసి తీసుకోమని భాగ్యం చెప్తుంది. నేను ఎలాగోలా మీ పెళ్లి చేశాను. నీ కాపురం జాగ్రత్త అంటూ శ్రీవల్లితో భాగ్యం చెప్తుంటే ప్రేమ వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంది అంత విన్నదేమోనని ఇద్దరు టెన్షన్ పడుతారు కానీ ప్రేమ వినదు. వాటర్ కోసం వచ్చానని ప్రేమ చెప్పగానే భాగ్యం వాటర్ ఇస్తుంది. మరొకవైపు నర్మద సాగర్ ని తీసుకొని శ్రీవల్లి వాళ్ళు నాన్న ఇంట్లో ఉన్నాడో లేదో చూడడానికి వస్తుంది. శ్రీవల్లి వాళ్ళు నాన్న నర్మద, సాగర్ వెళ్ళకముందే ఇంటికి వెళ్లాలని పరుగెడతాడు.
ఆ తర్వాత భాగ్యం కావాలనే ప్రేమ చేత టీ కప్పులు తీయిస్తుంది. భాగ్యం టీ కింద పడబోసి ఏమనుకోకు అమ్మ కాస్త ఇది క్లీన్ చేస్తావా అని భాగ్యం అనగానే ప్రేమ క్లీన్ చేస్తుంది. అది ధీరజ్ చూసి వచ్చి ప్రేమని ఆపుతాడు. తరువాయి భాగంలో నర్మద, సాగర్ భాగ్యం ఇంటికి వచ్చి బాబాయ్ గారిని పిలవండి అంటారు. ఆయన లేడని భాగ్యం అనగానే వీడియో కాల్ చెయ్యమని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |